ఆటలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2022-01-18T04:10:24+05:30 IST

ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, అందులోనూ సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఆటలు మరింత ఉత్సాహాన్నిస్తాయని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.

ఆటలతో మానసిక ఉల్లాసం
విజేత జట్టుకు కప్పును బహూకరిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

తడ,  జనవరి 17 : ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, అందులోనూ సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఆటలు మరింత ఉత్సాహాన్నిస్తాయని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వారం రోజులుగా తడ కొత్తకుప్పం వద్ద జరిగిన కబాడీ పోటీ విజేతలకు సోమవారం బహుమతి ప్రదానం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు మచ్చుకుప్పంకు చెందిన జట్టుకు ప్రథమ బహుమతిగా రూ. 50 వేలు, 2వ బహుమతి సాధించిన తడ కొత్తకుప్పంకు 30వేలు నగదు బహుమతులతోపాటు షీల్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు సూళ్లూరుపేట, తడ ఎంపీపీలు అల్లూరు అనిల్‌రెడ్డి, కొలవి రఘురెడ్డి, సర్పంచి ఆర్ముగం, వైసీపీ నాయకులు ఉచ్చూరు మునస్వామిరెడ్డి, జెట్టి వేణుయాదవ్‌, కోదండం, ఉపమండలాధ్యక్షుడు వెంకటేష్‌, రమేష్‌,  సీఐ వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-18T04:10:24+05:30 IST