తీర ప్రాంత భద్రతపై ప్రజలకు అవగాహన

ABN , First Publish Date - 2021-01-13T05:53:18+05:30 IST

ముంబై దాడుల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలకు భద్రతపై మెరైన్‌, స్థానిక పోలీసులు మంగళవారం అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు సముద్రతీరంలో, గ్రామాల్లో సంచరిస్తే తక్షణం సమాచారం అందించా లని కోరారు. మెరైన్‌ సీఐ గోవిందరావు, సీఐ సీహెచ్‌ అంబే ద్కర్‌, గార ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

తీర ప్రాంత భద్రతపై ప్రజలకు అవగాహన


గార: ముంబై దాడుల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలకు భద్రతపై మెరైన్‌, స్థానిక పోలీసులు మంగళవారం అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు సముద్రతీరంలో, గ్రామాల్లో సంచరిస్తే తక్షణం సమాచారం అందించా లని కోరారు. మెరైన్‌ సీఐ గోవిందరావు, సీఐ సీహెచ్‌ అంబే ద్కర్‌, గార ఎస్‌ఐ ఎం.హరికృష్ణ,  సిబ్బంది పాల్గొన్నారు. ఫ శ్వేతగిరి వేణుగోపాలస్వామి ఆలయాన్ని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ, సహాయ కమిషనర్‌ నాగప్రకాష్‌ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయాల భద్రతపై  ట్రస్టు బోర్డు అధ్యక్షులు సుగ్గు మధురెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఫ  శ్రీకూర్మనాథుని క్షేత్రంలో నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన వ్యాపారవేత్త ఏబీఎన్‌  ప్రసాద్‌, బంగారు వర్తకుడు వీఏ కృష్ణారావులు వేర్వేరుగా రూ.లక్ష వంతున మంగళవారం విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేతులమీదుగా దేవస్థానం అధికారులకు అందించారు. డీసీఎంఎస్‌  మాజీ  అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-13T05:53:18+05:30 IST