దేవాలయ భూములకు బహిరంగంగా కౌలువేలం నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-08-03T14:36:49+05:30 IST

నాదెండ్ల గ్రామంలోని..

దేవాలయ భూములకు బహిరంగంగా కౌలువేలం నిర్వహించాలి

చిలకలూరిపేట: నాదెండ్ల గ్రామంలోని హిందూ దేవాలయ భూములకు బహిరంగ కౌలువేలం నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని నాదెండ్ల, అప్పాపురం, తిమ్మాపురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో  కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. గ్రామానికి చెందిన ఒక నాయకుడు ఒత్తిడితో దేవదాయ శాఖ అధికారులు ఎలాంటి బహిరంగ కౌలు వేలం నిర్వహించకుండా రహస్యంగా వేలం నిర్వహించినట్లు రికార్డులు తయారు చేసినట్లు తమకు సమాచారం అందిందని వారు వివరించారు.  ఇప్పటికే సీజన్‌ ప్రారంభమైందని బహిరంగవేలం ద్వారా రైతులకు కౌలుకు ఇవ్వాలని లేనిపక్షంలో ప్రస్తుతం సాగుచేస్తున్నవారినే కొనసాగించాలని వారు కలెక్టర్‌ను కోరారు.


Updated Date - 2021-08-03T14:36:49+05:30 IST