తమిళ సర్కార్ కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు వరకు రవాణా మూత

ABN , First Publish Date - 2020-07-14T00:47:59+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్ విచ్చలవిడిగా చెలరేగిపోతుండడంతో తమిళ సర్కారు మరో కీలక నిర్ణయం

తమిళ సర్కార్ కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు వరకు రవాణా మూత

చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్ విచ్చలవిడిగా చెలరేగిపోతుండడంతో తమిళ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 వరకు ప్రజా, ప్రైవేటు రవాణాపై ఉన్న నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అంటే ప్రస్తుత లాక్‌డౌన్ చివరి రోజు వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, క్యాబులు, ఆటోలకు మాత్రం అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.


కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా జులై 31 వరకు ప్రజా, ప్రైవేటు రవాణా కార్యకలాపాలను నిషేధించినట్టు పేర్కొంది. వైరస్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాల్సిందిగా కోరింది.

Updated Date - 2020-07-14T00:47:59+05:30 IST