ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

ABN , First Publish Date - 2022-01-18T05:16:21+05:30 IST

ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ గరిమఅగర్వాల్‌

అదనపు కలెక్టర్‌ గరిమఅగర్వాల్‌

సుభాష్‌నగర్‌, జనవరి 17: ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి దరఖాస్తులను అదనపు కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిం చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  రెవెన్యూశాఖకు సంబంధిచినవి- 41, మున్సిపల్‌-3, పంచాయతీరాజ్‌-4, ఎస్సీ కార్పొరేషన్‌-3, వారధి-4, ఇతర శాఖకు సంబంధించినవి-7 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 


డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలి


డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ కార్యాలయాలకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేయాలని అధికారు లకు సూచించారు. కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌, ల్యాండ్‌ సర్వే అధికారి అశోక్‌, మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి, డీసీవో శ్రీమాల, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:16:21+05:30 IST