టీడీపీతోనే ప్రజా సంక్షేమం

ABN , First Publish Date - 2021-10-28T04:26:09+05:30 IST

తెలుగుదేశంపార్టీ పాలనలోనే ప్రజలకు సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీపీ, టీడీపీ మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గురవాజీపేట గ్రామంలో బుఽధవారం టీడీపీ గ్రామ కమిటీ ఎంపిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పాలనలో రాష్ట్ర అఽథోగతి పాలైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పథకాల పేరుతో అలవిగాని హామీలు గుప్పించి చివరకు రాష్ర్టాన్ని సీఎం జగన్‌ అప్పులపాలు చేశారని విమర్శించారు.

టీడీపీతోనే ప్రజా సంక్షేమం
నూతన కార్యవర్గ కమిటీతో టీడీపీ నాయకులు

కనిగిరి, అక్టోబరు 27: తెలుగుదేశంపార్టీ పాలనలోనే ప్రజలకు సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీపీ,  టీడీపీ మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గురవాజీపేట గ్రామంలో బుఽధవారం టీడీపీ గ్రామ కమిటీ ఎంపిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పాలనలో రాష్ట్ర అఽథోగతి పాలైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పథకాల పేరుతో అలవిగాని హామీలు గుప్పించి చివరకు రాష్ర్టాన్ని సీఎం జగన్‌ అప్పులపాలు చేశారని విమర్శించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నూతన గ్రామ టీడీపీ కార్యవర్గ కమిటీకి సూచించారు. ఈ గ్రామ కమిటీ ఎంపికలో గురవాజీపేట గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా యర్రంరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, నాయకులు భేరి పుల్లారెడ్డి, ఓబుల్‌రెడ్డి, సైకం మాలకొండారెడ్డి, నాగిరెడ్డి, చెంచిరెడ్డి, వెంకటరెడ్డి, అశోక్‌, ప్రభాకర్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T04:26:09+05:30 IST