శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవం

ABN , First Publish Date - 2022-01-20T05:16:39+05:30 IST

చిన వెంకన్న ఆలయంలో ద్రవిడ ప్రబంధ అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.

శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవం
శ్రీవారి ఉత్సవ మూర్తులకు పూజలు చేస్తున్న అర్చకులు

ద్వారకాతిరుమల, జనవరి 19: చిన వెంకన్న ఆలయంలో ద్రవిడ ప్రబంధ అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ముక్కోటి మొదలు పది రోజుల పాటు ఆల యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. బుధవారం స్వామి అమ్మవార్లను తొళక్కం వాహనంపై శ్రీవారి ఉత్సవ మూర్తులను నిత్య కల్యాణమండపం వేదికపై ఉంచి ప్రత్యేక పూజలు చేశా రు. కలశ స్థాపన, అభిషేకాలు, తిరుమంజనాలు చేసి హారతులు ఇచ్చారు.

Updated Date - 2022-01-20T05:16:39+05:30 IST