పులి వాహనంపై చాముండేశ్వరి దేవీ
ABN , First Publish Date - 2021-06-22T04:25:35+05:30 IST
మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు పులివాహన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఇందుకూరుపేట, జూన్ 21 : మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు పులివాహన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చప్పర ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం విశేష పరిమళ పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని పులివాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అంతకు ముందు అభిషేకాలు, పూజలు కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించారు. గంగపట్నం పల్లిపాళెం పల్లెకాపులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అర్చకులు అనీల్, సుధీర్ స్వాములు, ఆలయ అధికారులు, నిర్వాహకులు దండిగుంట శరత్నాయుడు, ఫణీంద్ర, కొండూరు కృష్ణారెడ్డి తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు పులివాహన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.