పులిచింతల ప్రాజెక్ట్‌ పనులపై బహిరంగ చర్చకు సిద్ధం: కాల్వ

ABN , First Publish Date - 2021-08-06T20:31:27+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌ పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు సవాల్ విసిరారు. జలయజ్ఞం పేరుతో మాజీ సీఎం వైఎస్సార్ ధనయజ్ఞం చేశారని ఆరోపించారు.

పులిచింతల ప్రాజెక్ట్‌ పనులపై బహిరంగ చర్చకు సిద్ధం: కాల్వ

కర్నూలు: పులిచింతల ప్రాజెక్ట్‌ పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు సవాల్ విసిరారు. జలయజ్ఞం పేరుతో మాజీ సీఎం వైఎస్సార్ ధనయజ్ఞం చేశారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీఎం అయ్యాకే పులిచింతల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్‌ పనులపై నాడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. మన్నిక కంటే దోపిడీయే ప్రధానంగా పులిచింతల పనులు చేశారని ఆరోపించారు. నాయకులు, కాంట్రాక్టర్ల దోపిడీకి స్వేచ్ఛనిచ్చేలా.. రాజశేఖర్‌రెడ్డి ఈపీసీ విధానం అమలు చేశారని చెప్పారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై నెపం వేయడం తగదని కాల్వ శ్రీనివాసులు హితవుపలికారు. 

Updated Date - 2021-08-06T20:31:27+05:30 IST