Telangana: పులిచింతల ప్రాజెక్ట్ నీటి మట్టం 173.35 అడుగులు
ABN , First Publish Date - 2021-07-29T14:40:31+05:30 IST
పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77
సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 43.25 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ఇప్పటి వరకు నీటిమట్టం 173.35 అడుగులకు చేరింది.ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 5,600క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పాదన కోసం 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2 యూనిట్ల ద్వారా 30మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.