పులికనుమ అంచనా వ్యయం రూ.310 కోట్లు
ABN , First Publish Date - 2020-12-04T05:40:11+05:30 IST
జిల్లాలో పులికనుమ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయాన్ని రూ.310 కోట్లకు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు నీటి పారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామచంద్ర మూర్తి తెలిపారు.
- సవరిస్తూ ఉత్తర్వులు జారీ
- ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 3: జిల్లాలో పులికనుమ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయాన్ని రూ.310 కోట్లకు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు నీటి పారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామచంద్ర మూర్తి తెలిపారు. ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరందించేందుకు కోసిగి వద్ద తుంగభద్ర నదిపై నిర్మించ తలపెట్టిన పులికనుమ ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం అంచనాలు, డిజైన్లు, సర్వే నిర్మాణం, నిర్వహణ అంశాలతో టర్న్కీ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద న్నారు. పులికనుమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రెండు దశల్లో రిజర్వాయర్ పంపింగ్ నిర్మాణానికి, 1.23 టీఎంసీల నీటి నిల్వకు రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.310.46 కోట్లతో అనుమ తులు జారీ చేసిందని తెలిపారు. 2008లో రూ.261 కోట్లకు పులికనుమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. మార్కెట్ ధరలను అంచనావేసి గత ప్రభుత్వం వ్యయాన్ని రూ.293 కోట్లకు సవరించిందని, ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఈ అంచనా వ్యయాన్ని రూ.310 కోట్లకు పెంచిందని వివరించారు.