ఆదివారం పునీత్ అంత్యక్రియలు: సీఎం బొమ్మై
ABN , First Publish Date - 2021-10-30T22:25:37+05:30 IST
పునీత్ రాజ్కుమార్కు కడసారిగా నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు, సినీ, రాజకీయ, ఇతర..
బెంగళూరు: పునీత్ రాజ్కుమార్కు కడసారిగా నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తరలి వస్తుండటంతో ఆయన అంత్యక్రియలను ఆదివారంనాడు జరిపేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కంఠీరవ స్టేడియంలో ప్రజా సందర్శనార్థం పునీత్ భౌతికకాయాన్ని ఉంచడంతో స్టేడియం జనసంద్రమైంది. తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సైతం పునీత్కు నివాళులర్పిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
భారీగా అభిమానులు తరలి వస్తున్నందున ఆదివారం ఉదయం వరకూ వారిని అనుమతిస్తామని, ప్రజలంతా సహకరించి, ప్రశాంతంగా ఉండాలని ముఖ్యమంత్రి బొమ్మై విజ్ఞప్తి చేశారు. పునీత్ రాజ్కుమార్ కుమార్తె ధృతి రాజ్కుమార్ అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారనీ, సాయంత్రం 5.30 గంటల ప్రాంతానికి ఆమె బెంగళూరు చేరుకుంటారని ఆయన చెప్పారు. కాగా, శనివారం సాయంత్రమే ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలకు ప్లాన్ చేసినప్పటికీ పోలీసులు, అధికారుల సూచన మేరకు ఆదివారానికి అంత్యక్రియలు వాయిదా వేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.