వారం నుంచి ఆహారం తీసుకోని పునీత్ అభిమాని మృతి
ABN , First Publish Date - 2021-11-06T18:09:57+05:30 IST
పునీత్ రాజ్కుమార్ మృతిచెందినప్పటి నుంచి ఆహారం మానేసిన చామరాజనగర్ జిల్లా కొళ్ళేగాల భీమానగర్ నివాసి శివమూర్తి(31) మృతిచెందారు. అక్టోబరు 29న శుక్రవారం పునీత్ మృతిచెందినప్పటి నుంచి అహారం మానేశారు.
బెంగళూరు(Karnataka): పునీత్ రాజ్కుమార్ మృతిచెందినప్పటి నుంచి ఆహారం మానేసిన చామరాజనగర్ జిల్లా కొళ్ళేగాల భీమానగర్ నివాసి శివమూర్తి(31) మృతిచెందారు. అక్టోబరు 29న శుక్రవారం పునీత్ మృతిచెందినప్పటి నుంచి అహారం మానేశారు. ఫొటోగ్రాఫర్గా కొనసాగే శివమూర్తి పలుమార్లు పునీత్ను కలిశారు. పునీత్ తరహాలోనే డ్యాన్సులు చేసేవారు. వారం రోజులుగా ఆహారం తీసుకోని శివమూర్తిని కుటుంబ సభ్యులు, మిత్రులు తీరుమార్చుకోవాలని సూచించారు. వినకపోగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శివమూర్తి మృతిచెందారు.