సమవుజ్జీల సమరం
ABN , First Publish Date - 2020-09-24T09:06:04+05:30 IST
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సమరం ఎప్పుడూ ఆసక్తికరమే. కారణం..రెండు జట్లు సమవుజ్జీలు కావడం...
నేడు బెంగళూరుతో పంజాబ్ ఢీ
దుబాయ్: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సమరం ఎప్పుడూ ఆసక్తికరమే. కారణం..రెండు జట్లు సమవుజ్జీలు కావడం. ఇప్పటివరకు టోర్నీలో రెండు జట్లు 24సార్లు తలపడగా..బెంగళూరు-పంజాబ్ చెరో 12 మ్యాచ్ల్లో గెలుపొందాయి. కానీ ఈసారి ఐపీఎల్ను రెండు జట్లు భిన్నంగా ఆరంభించాయి. ఆర్సీబీ మొదటి పోరులో సన్రైజర్స్పై అలవోకగా నెగ్గింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్లో తొలి పోటీలో సునాయాసంగా విజయం సాధించాల్సిన పంజాబ్..అనూహ్యంగా ఓడింది. ఓటమినుంచి తేరుకొని తొలి విజయం సాధించాలని పంజాబ్ పట్టుదలగా ఉంది. ఇక..మొదటి మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆర్సీబీ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది.