ప్రధాని వద్ద పంజాబ్ సీఎం ఆవేదన

ABN , First Publish Date - 2021-08-12T01:34:35+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. సాగుచట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా అమరీందర్ ప్రధానిని కోరారని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

ప్రధాని వద్ద పంజాబ్ సీఎం ఆవేదన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. సాగుచట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ప్రధానిని అమరీందర్ కోరారని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఉద్యమం పంజాబ్‌ ఆర్ధిక రంగంపై ప్రభావం చూపుతోందంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారని తెలిపింది. పాకిస్థాన్‌కు మద్దతిచ్చే శక్తులు రైతుల పోరాటాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని, అది దేశ భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కూడా సీఎం ప్రధాని దృష్టికి తెచ్చినట్లు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. వీలైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించింది. 



Updated Date - 2021-08-12T01:34:35+05:30 IST