కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-18T20:47:30+05:30 IST

పంజాబ్‌ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి బీఎస్‌ఎఫ్‌కు అధికార పరిధిని పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పంజాబీలను అసంతృప్తికి గురి చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం..

కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

చండీగఢ్: భారత సరిహద్దు దళాల (బీఎస్‌ఎఫ్) అధికార పరిధిని పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి అనుమతి ఇవ్వడంపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై పంజాబ్ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్యని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చన్నీ డిమాండ్ చేశారు. సోమవారం పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.


‘‘పంజాబ్‌ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి బీఎస్‌ఎఫ్‌కు అధికార పరిధిని పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పంజాబీలను అసంతృప్తికి గురి చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా కేంద్రం ఏక పక్షంగా వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని చన్నీ అన్నారు.

Updated Date - 2021-10-18T20:47:30+05:30 IST