పంజాబ్ 200 మిస్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-19T02:49:39+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో.. 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(61 నాటౌట్: 51 బంతుల్లో.. 7 ఫోర్లు, 2 సిక్స్), అదిరిపోయే..

పంజాబ్ 200 మిస్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో.. 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(61 నాటౌట్: 51 బంతుల్లో.. 7 ఫోర్లు, 2 సిక్స్), అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. 13 ఓవర్ల వరకు వికెట్ పడకుండా బౌండరీల మోత మోగించారు. అయితే వీరిద్దరూ అవుటైన తరువాత పంజాబ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. దీనికి తోడు చివర్లో ఢిల్లీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 200 మార్కును తృటిలో మిస్ చేసుకున్నారు. కానీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసింది. మరికాసేపట్లో ఢిల్లీ 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-19T02:49:39+05:30 IST