IPL 2021: ఇంగ్లండ్ నుంచి దుబాయ్ చేరుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులు
ABN , First Publish Date - 2021-09-12T22:56:36+05:30 IST
ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్ నేడు ఇంగ్లండ్ నుంచి నేరుగా
దుబాయ్: ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్ నేడు ఇంగ్లండ్ నుంచి నేరుగా దుబాయ్ చేరుకున్నారు. జట్టుతో చేరడానికి ముందు వీరు ఆరు రోజులపాటు క్వారంటైన్లో గడపనున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు తన తొలి మ్యాచ్లో ఈ నెల 21న రాజస్థాన్ రాయల్స్ను ఎదుర్కొంటుంది. యూకే నుంచి వచ్చే ప్రతీ ఆటగాడిని తప్పనిసరిగా ఆరు రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలని, ఆ తర్వాతే జట్టు బయోబబుల్కు పంపాలని అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది.
ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరగాల్సిన చివరి టెస్టు రద్దు అయిన తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను దుబాయ్కు తరలిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ నేపథ్యంలో డేవిడ్ మలాన్ అందుబాటులో లేకపోవడంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతడి స్థానంతో దక్షిణాఫ్రికా స్టార్ మార్కరమ్తో ఒప్పందం నిన్న చేసుకుంది.