తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
ABN , First Publish Date - 2021-04-19T02:08:07+05:30 IST
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు తొలి వికెట్ దక్కింది. మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో.. 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్థసెంచరీతో..
ముంబై: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు తొలి వికెట్ దక్కింది. మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో.. 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్థసెంచరీతో అదరగొట్టి 13వ ఓవర్లో అవుటయ్యాడు. మెరివాలా వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదబోయి అక్కడ ధవన్ చేతికి నేరుగా క్యాచ్ ఇచ్చాడు. దీంతో 122 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(45 నాటౌట్: 39 బంతుల్లో.. 6 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ గేల్ క్రీజులో ఉన్నారు.