pathankot: సైనిక శిక్షణలో ఒక జవాను మృతి.. ఆసుపత్రిలో పలువురి చేరిక!

ABN , First Publish Date - 2021-08-22T14:31:06+05:30 IST

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పరిధిలోగల మామూన్ మిలటరీ స్టేషన్‌లో...

pathankot: సైనిక శిక్షణలో ఒక జవాను మృతి.. ఆసుపత్రిలో పలువురి చేరిక!

పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పరిధిలోగల మామూన్ మిలటరీ స్టేషన్‌లో సైనిక శిక్షణ జరుగుతున్న సమయంలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు జవానులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. విపరీతమై ఎండలో శిక్షణ జరుగుతుండగా వడదెబ్బ తగిలి ఒక జవాను మృతి చెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వడదెబ్బకు గురైన మరో నలుగురు జవానులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పఠాన్‌కోట్‌లో 11 మంది అధికారులు, 11 మంది జూనియర్ కమిషన్ ఆఫీసర్లు, 20 ఇతర ర్యాంకులకు సంబంధించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated Date - 2021-08-22T14:31:06+05:30 IST