వ్యాక్సిన్ తీసుకోకపోతే జీతాలివ్వం

ABN , First Publish Date - 2021-12-23T00:33:51+05:30 IST

న్యూఢిల్లీ: వ్యాక్సిన్లు తీసుకోకపోతే జీతాలివ్వబోమని పంజాబ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.

వ్యాక్సిన్ తీసుకోకపోతే జీతాలివ్వం

న్యూఢిల్లీ: వ్యాక్సిన్లు తీసుకోకపోతే జీతాలివ్వబోమని పంజాబ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు వ్యాక్సిన్లు లేదా కనీసం ఒక వ్యాక్సిన్ అయినా తీసుకుని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేస్తేనే జీతాలిస్తామని స్పష్టం చేసింది. 


మరోవైపు రెండు వ్యాక్సిన్లు తీసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని హర్యానా ఇప్పటికే ప్రకటించింది. పెళ్లి మండపాలు, హోటళ్లు, బ్యాంకులు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించబోమని హర్యానా ఆరోగ్యశాఖామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. టీకాలు తీసుకోనివారు బస్సు ప్రయాణాలు చేయడానికి కూడా వీల్లేదన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. గుజరాత్‌లో ఈ నెల 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు అనుమతినీయలేదు.  

Updated Date - 2021-12-23T00:33:51+05:30 IST