నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-04-21T05:10:51+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సూచించారు.

నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేపట్టాలి
దౌల్తాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు


రాయపోల్‌, ఏప్రిల్‌ 20: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సూచించారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి, ఎల్కల్‌, బేగంపేట, దౌల్తాబాద్‌ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివా్‌సగుప్తా, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు చంద్రశేఖర్‌, ప్రవీణ్‌, వెంకన్న, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రణం శ్రీనివా్‌సగౌడ్‌, బీజేపీ మండలాధ్యక్షుడు వెంకట్‌గౌడ్‌, నాయకులు వేణుగోపాల్‌, నర్ర సత్యం, పబ్బ అశోక్‌, స్వామి, రవి పాల్గొన్నారు.


 

Updated Date - 2021-04-21T05:10:51+05:30 IST