reopen: పూరి ఆలయం 15 నుంచి పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-05T18:40:03+05:30 IST

పూరిలోని ప్రముఖ జగన్నాథ ఆలయం తెరచుకోనుంది....

reopen: పూరి ఆలయం 15 నుంచి పునర్ ప్రారంభం

భువనేశ్వర్ (ఒడిశా): పూరిలోని ప్రముఖ జగన్నాథ ఆలయం తెరచుకోనుంది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఇన్నాళ్లు మూసివేసిన పూరి జగన్నాథ ఆలయాన్ని స్థానిక భక్తుల కోసం ఈ నెల 16వతేదీ నుంచి తెరవాలని గుడి యాజమాన్యం నిర్ణయించింది. బయటి ప్రాంతాల భక్తులకు ఈ నెల 23వతేదీ నుంచి ప్రవేశం కల్పించనున్నారు. ఆలయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 8గంటల వరకు తెరిచి ఉంచుతామని, భక్తులందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్లు, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టులను తప్పనిసరిగా చూపించాలని దేవాలయ నిర్వాహకులు చెప్పారు. ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు 96 గంటల లోపు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి.గతంలో కరోనా కేసుల పెరుగుదలతో పూరి ఆలయాన్ని మూసివేశారు.

Updated Date - 2021-08-05T18:40:03+05:30 IST