Travel train: షిర్డీ - కాశీలకు ప్రత్యేక యాత్రా రైలు
ABN , First Publish Date - 2022-09-24T14:44:28+05:30 IST
భారత్ గౌరవ్ పథకం కింద మదురై నుంచి షిర్డీ-కాశీలకు ప్రత్యేక యాత్రా రైలు(Special Excursion Train) నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. మదురై నుం
ఐసిఎఫ్(చెన్నై), సెప్టెంబరు 23: భారత్ గౌరవ్ పథకం కింద మదురై నుంచి షిర్డీ-కాశీలకు ప్రత్యేక యాత్రా రైలు(Special Excursion Train) నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. మదురై నుంచి షిర్డీకి అక్టోబరు 12, మదురై నుంచి కాశీకి 21వ తేది బయల్దేరే రైళ్లు చెన్నై మీదుగా వెళ్లనున్నాయి. దీపావళి రోజున కాశిలో పుణ్యస్నానాలాచరించి, స్వర్ణ అన్నపూరిణి ప్రత్యేక లడ్డు రథోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ రైళ్ల రిజర్వేషన్ www.ularail.com అనే వెబ్సైట్లో చేసుకోవాలని అధికారులు తెలిపారు.