చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి

ABN , First Publish Date - 2020-10-17T17:54:26+05:30 IST

ఒంగోలు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌లోని షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న..

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి

ప్రకాశం జిల్లా: ఒంగోలు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌లోని షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న నాగరాజు అనే యువకుడిని వ్యాపారులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. షాపుల్లో దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. గతంలో కూడా నాగరాజు దొంగతనాలకు పాల్పడగా పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వ్యాపారులు ఆరోపించారు. కాగా గత రాత్రి ఓ షాపులో దొంగతనానికి లోపలకు వెళ్లిన నాగరాజు బయటకు రాలేక లోపలే ఉండిపోయాడు. దీంతో శనివారం ఉదయాన్నే షాపు తీసిన యజమాని గమనించి అతనిని బయటకు తీసుకువచ్చి.. వ్యాపారులంతా కలిసి దేహశుద్ది చేశారు. 

Updated Date - 2020-10-17T17:54:26+05:30 IST