పర్సులో 900.. 14ఏళ్ల క్రితం పోయింది.. ఇప్పుడు దొరికింది!

ABN , First Publish Date - 2020-08-10T02:43:07+05:30 IST

ఎప్పుడో పధ్నాలుగేళ్ల క్రితం పర్సు పోగొట్టున్నాడో వ్యక్తి. దానిలో రూ.900 ఉన్నాయి.

పర్సులో 900.. 14ఏళ్ల క్రితం పోయింది.. ఇప్పుడు దొరికింది!

ముంబై: రాసిపెట్టుంటే ఎటు పోయినా మనకు దక్కాల్సింది మనకే దక్కుతుంది. ముంబైలో జరిగిన ఓ ఘటన ఈ మాటని నిజం చేస్తోంది. ఎందుకంటే ఎప్పుడో పధ్నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్సు ఇప్పుడు దొరికింది. అంతేకాదు దానిలో ఉండాల్సిన రూ.900 కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి 2006లో పర్సు పోగొట్టుకున్నాడు. ఎంత వెదికినా అది దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆ ఆలోచన వదిలేసి బతుకుపోరాటంలో బిజీ అయిపోయాడు. 14ఏళ్ల తర్వాత ఇప్పుడు అతనికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ పోయిన పర్సు దొరికిందని వాళ్లు చెప్పారు. పర్సులోని సొమ్ములో స్టాంపు డ్యూటీల కింద రూ.100 తీసుకున్నారు. ప్రస్తుతానికి రూ.300 అతనికి ఇచ్చారు. పర్సులోని రూ.500 నోటు పాతది కావడంతో అది చెల్లదు. కాబట్టి కొత్త నోటు మార్చి ఇస్తామన్నారు.

Updated Date - 2020-08-10T02:43:07+05:30 IST