దేవదాయ శాఖ డీసీగా పుష్పవర్దన్
ABN , First Publish Date - 2021-06-23T05:53:38+05:30 IST
దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్(డీసీ)గా ఇ.పుష్పవర్దన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్నారు.
విశాఖపట్నం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్(డీసీ)గా ఇ.పుష్పవర్దన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్నారు. రామతీర్థాలలోని హుండీ లెక్కింపులో అవకతవకలు వెలుగు చూడటంతో అప్పుడు డీసీగా ఉన్న సుజాతను సస్పెండ్ చేసి, ఆ స్థానంలో కనకమహాలక్ష్మి ఆలయం ఈఓ జ్యోతి మాధవికి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. పుష్పవర్దన్ గతంలో ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు.