కొవిడ్‌ బాధితులకు పుష్పిత్‌ స్టీల్స్‌ వితరణ

ABN , First Publish Date - 2021-06-14T05:41:57+05:30 IST

కొవిడ్‌ బాధితుల సహాయార్థం పుష్పిత్‌ స్టీల్స్‌ సంస్థ ఐదు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, రెండువేల మాస్కులు, శానిటైజర్లను వితరణగా ఇచ్చింది.

కొవిడ్‌ బాధితులకు పుష్పిత్‌ స్టీల్స్‌ వితరణ
ఎమ్మెల్యే మధుకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్న పుష్పిత్‌ స్టీల్స్‌ సీఈవో బలరామిరెడ్డి

శ్రీకాళహస్తి అర్బన్‌, జూన్‌ 13: సామాజిక సేవతోనే మానవజన్మకు సార్థకతని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ బాధితుల సహాయార్థం పుష్పిత్‌ స్టీల్స్‌ సంస్థ ఐదు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, రెండువేల మాస్కులు, శానిటైజర్లను వితరణగా ఇచ్చింది. వీటిని ఆదివారం ఆ సంస్థ ప్రతినిధులు పట్టణ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ... కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి మనిషి మానవతా దృక్పథంతో ఇతరులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతో దాతల సాయం కోరామన్నారు. కార్యక్రమంలో పుష్పిత్‌ స్టీల్స్‌ సీఈవో బలరామిరెడ్డి, జీఎం వివేకానందరెడ్డి, అధికారులు సాగర్‌, శరత్‌రెడ్డి, సర్పంచ్‌ గంగాధరం, నాయకులు కిషోర్‌రెడ్డి, హరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T05:41:57+05:30 IST