ఆ ముగ్గురిపై క్రిమినల్‌ కేసులు పెట్టండి

ABN , First Publish Date - 2021-06-20T06:34:47+05:30 IST

చిన్నగొట్టిగల్లు రెవెన్యూ కార్యాలయానికి చెందిన ముగ్గురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తహసీల్దారుకు సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆదేశాలు జారీ చేశారు.

ఆ ముగ్గురిపై క్రిమినల్‌ కేసులు పెట్టండి

చిన్నగొట్టిగల్లు తహసీల్దార్‌కు సబ్‌కలెక్టర్‌ ఆదేశం


భాకరాపేట, జూన్‌ 19: చిన్నగొట్టిగల్లు రెవెన్యూ కార్యాలయానికి చెందిన ముగ్గురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తహసీల్దారుకు సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం తహసీల్దారు హనుమా నాయక్‌ ముగ్గురు ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరుతూ భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఫిర్యాదులో పేర్కొన్న మేరకు.. దేవరకొండ గ్రామానికి చెందిన సర్వే నెంబరు 36లో జానకమ్మకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి పేరుతో పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై జానకమ్మ ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్‌ విచారణకు సబ్‌ కలెక్టరు ఆదేశించారు.దర్యాప్తులో జానకమ్మ పేరుతో వున్న భూమిని మరో వ్యక్తి పేరుతో మార్చడం అక్రమమేనని తేల్చారు. డిప్యూటీ తహసీల్దారు ఫజులుల్లా, ఆర్‌ఐ శ్రీనివాసులు రెడ్డి, వీఆర్వో సిద్ధయ్య ఇందుకు బాధ్యులుగా భావించి కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు.

Updated Date - 2021-06-20T06:34:47+05:30 IST