పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: పువ్వాడ
ABN , First Publish Date - 2021-08-14T00:52:09+05:30 IST
పేదల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని
భద్రాద్రి: పేదల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అన్ని సౌకర్యాలు సమకూరాయని, కరోనా విపత్కర పరిస్థితులతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి క్షీణించినా సంక్షేమ పథకాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నామని తెలిపారు. వెనుకబడిన దళిత జాతిని ముందుకు తీసుకురావడానికి కేసీఆర్ ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. దళితులు, గిరిజనులను పట్టి పీడిస్తున్న రుగ్మతలను తొలగించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. ఫలితంగా పేదలు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారని పువ్వాడ అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.