సోనియా ఆలోచన మేరకే పీవీ ప్రధాని అయ్యారు: వీహెచ్‌

ABN , First Publish Date - 2020-09-30T00:29:32+05:30 IST

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచన మేరకే పీవీ నరసింహరావు ప్రధాని అయ్యారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చెప్పారు. జాగీర్‌దారు వ్యవస్థ

సోనియా ఆలోచన మేరకే పీవీ ప్రధాని అయ్యారు: వీహెచ్‌

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచన మేరకే పీవీ నరసింహరావు ప్రధాని అయ్యారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చెప్పారు. జాగీర్‌దారు వ్యవస్థ రద్దుకు పీవీ ఎనలేని కృషి చేశారని, ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌, భూ సంస్కరణలు పీవీ అమలు చేశారని గుర్తుచేశారు. పీవీ ఆలోచనలకు విరుద్ధంగా భూములన్నీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయని, పీవీ ఆలోచనలు అమలు చేయాలని, పేదలకు భూములు దక్కాలన్నారు. పేదలకు భూములు దక్కినప్పుడే పీవీకి నిజమైన నివాళి అని వీహెచ్‌ అన్నారు.

Updated Date - 2020-09-30T00:29:32+05:30 IST