‘పీవీకి భారతరత్న ఇవ్వాలి’
ABN , First Publish Date - 2020-07-13T10:41:13+05:30 IST
స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని తెలంగాణ బీసీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు కె.మురళీకృష్ణ ..
గోల్నాక, జూలై 12(ఆంధ్రజ్యోతి): స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని తెలంగాణ బీసీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు కె.మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని దిల్ఖుష్ అతిథిగృహంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డిని కె.మురళీకృష్ణ, తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర వర్కింగ్ప్రెసిడెంట్ బోయపల్లి లింగంగౌడ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్రావు, కోశాధికారి శ్రీధర్, సంయుక్త కార్యదర్శి మహేష్ తదితరులతో కలిసి వినతి ప్రతం అందజేశారు. పీవీ నరసింరావుకు భారతరత్న లభించేలా కృషి చేస్తానని కిషన్రెడ్డి భరోసా ఇచ్చారని వారు తెలిపారు.