10 నెలల్లో పీవీ మెమోరియల్‌ పూర్తి: కేకే

ABN , First Publish Date - 2020-08-02T08:49:37+05:30 IST

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మెమోరియల్‌ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్‌లోగా (10 నెలల్లో) పూర్తి చేయాలని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ

10 నెలల్లో పీవీ మెమోరియల్‌ పూర్తి: కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మెమోరియల్‌ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్‌లోగా (10 నెలల్లో) పూర్తి చేయాలని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పిన పీవీ మెమోరియల్‌ డిజైన్లలో నాలుగింటిని కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల సమన్వయంతో ఆస్ట్రేలియా, లండన్‌, న్యూజిలాండ్‌, అమెరికా, సింగపూర్‌తోపాటు వివిధ దేశాల్లో పీవీ విగ్రహాలను ఆవిష్కరించాలని తీర్మానించింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రూపొందించిన ఞఠిుఽట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌పీపీ నేత కె.కేశవరావు శనివారం ప్రారంభించారు.  

Updated Date - 2020-08-02T08:49:37+05:30 IST