నేను.. నా సిబ్బంది తప్పు చేస్తే.. మమ్మల్ని తరిమి తరిమి కొట్టండి: పీవీపీ

ABN , First Publish Date - 2022-01-19T20:26:46+05:30 IST

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో తనపై నమోదైన కేసులపై పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) స్పందించారు.

నేను.. నా సిబ్బంది తప్పు చేస్తే.. మమ్మల్ని తరిమి తరిమి కొట్టండి: పీవీపీ

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో తనపై నమోదైన కేసులపై పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీవీపీ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారని తనకు చాలామంది ఫోన్లు చేశారన్నారు. నాలుగు వారాలుగా కుటుంబంతో గోవాలో ఉన్నామన్నారు. తనపై, తన సిబ్బందిపై కేసు పెట్టినట్లు ఇప్పుడే తెలిసిందన్నారు. ‘మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని, నా సిబ్బందిని, తరిమి తరిమి కొట్టండని’ అన్నారు.


తప్పు చేసిన వాళ్లను తప్పని చెప్పడం తన తప్పంటే ఒప్పుకోనని పీవీపీ అన్నారు. నిన్న జరిగినవన్నీ వీడియోలో అందరూ చూశారని హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని.. అందరికీ కోర్టు ఆర్డర్స్ చూపించిన తర్వాతే తమ స్థలంలోనే పనులు చేపట్టామని ఆయన అన్నారు. పైగా తాము తప్పు చేశామంటూ కేసులు పెట్టారని, ఇలాంటి కేసులకు తాను భయపడే మనిషిని కాదని పీవీపీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-19T20:26:46+05:30 IST