మద్యం కోసం బారులు
ABN , First Publish Date - 2021-05-06T06:18:03+05:30 IST
కరోనా నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
ఉరవకొండ, మే 5: కరోనా నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మందుబాబులు మందు కోసం ఎగబడ్డారు. దుకాణం మూసేస్తే మందు దొరకదని కనీసం భౌతికదూరం కూడా పాటించకుండా క్యూ కట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఇలా గుంపులు గుంపులుగా ఉంటే కరోనా విస్తరించదా అంటూ చర్చించుకున్నారు.