కోలుకుంటున్న ఖతార్..

ABN , First Publish Date - 2020-09-20T17:47:15+05:30 IST

గల్ఫ్ దేశమైన ఖతార్ మహమ్మారి కరోనా నుంచి క్రమంగా కోలుకుంటోంది.

కోలుకుంటున్న ఖతార్..

దోహా: గల్ఫ్ దేశమైన ఖతార్ మహమ్మారి కరోనా నుంచి క్రమంగా కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు తగ్గి.. రికవరీలు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా రికవరీలు 1.20 లక్షల మార్కును దాటాయి. శనివారం నమోదైన 267 రికవరీలతో కలిపి ఇప్పటివరకు ఖతార్‌లో కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,20,087కు చేరింది. అలాగే నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన 4,874 కరోనా పరీక్షల్లో 229 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1,23,146కు చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఖతార్ వ్యాప్తంగా 209 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 2,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి ఇప్పటివరకు మూడు కోట్లకుపైగా మందికి ప్రబలింది. అలాగే 9.60 లక్షల మందిని కబళించింది. 


Updated Date - 2020-09-20T17:47:15+05:30 IST