రైతు వేదిక నిర్మాణంలో నాణ్యత లోపం!

ABN , First Publish Date - 2020-12-01T08:45:29+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌

రైతు వేదిక నిర్మాణంలో నాణ్యత లోపం!

యువకుడి ట్వీట్‌.. వెంటనే అధికారులను ప్రశ్నించిన కేటీఆర్‌


ఆదిలాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులు నాసిరకంగా  సాగుతున్నాయని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో పాటు సంబంధిత అధికారులను ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌కు కేటీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది. వెంటనేఅధికారులు రైతువేదిక పనులను పరిశీలించేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. పనుల నాణ్యతపై కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు.   

Updated Date - 2020-12-01T08:45:29+05:30 IST