ఆలయాల్లో నిత్యాన్నదానికి రూ.2 లక్షల వితరణ

ABN , First Publish Date - 2021-08-03T03:19:16+05:30 IST

మండలంలోని గండిపాళెం గ్రామానికి చెందిన జీఎంకే ట్రస్టు అధినేత గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి సోమవారం ఆలయాల్లో నిత్యాన్నదానికి రూ.2 లక్షల విరాళం అందజేశారు.

ఆలయాల్లో నిత్యాన్నదానికి రూ.2 లక్షల వితరణ
నగదు అందజేస్తున్న దాత మాలకొండయ్యచౌదరి

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 2: మండలంలోని గండిపాళెం గ్రామానికి చెందిన జీఎంకే ట్రస్టు అధినేత గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి సోమవారం ఆలయాల్లో నిత్యాన్నదానికి రూ.2 లక్షల విరాళం అందజేశారు. ప్రకాశం జిల్లా వల్లేటివారిపాళెం మండలం మాలకొండలో వెలసి ఉన్న శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి రూ.లక్ష, సీఎ్‌సపురం మండలం కోయిలంపాడు గ్రామంలో వెలసి ఉన్న నారాయణస్వామి ఆలయానికి రూ.50 వేలు, దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీవెంగమాంబ పేరంటాలమ్మ ఆలయానికి రూ.50 వేల చొప్పున నిత్యాన్నదానికి విరాళాలను అందజేశారు. అలాగే నారాయణస్వామి జీవితచరిత్ర షార్ట్‌ఫిల్మ్‌ తీస్తున్న ఆచారి అనే భక్తుడికి రూ.25 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు గుంటుపల్లి నాగేశ్వరి, మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, శ్రీరామచంద్రమూర్తి, నారాయణస్వామి ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, మాలకొండయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T03:19:16+05:30 IST