Tiruvannamalai రథం దిగువ శిలాశాసనం
ABN , First Publish Date - 2021-12-01T16:29:34+05:30 IST
తిరువణ్ణామలైలో ఆలయ సమీపంలోని మురుగన్ కొయ్య రథం దిగువన ఓ శిలాశాసనం ఉండటాన్ని పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఆ రథం నేలపై ఒరిగిపోకుండా ఓ రాతిని ఆసరాగా నిలబెట్టారు. అయితే ఆ
చెన్నై: తిరువణ్ణామలైలో ఆలయ సమీపంలోని మురుగన్ కొయ్య రథం దిగువన ఓ శిలాశాసనం ఉండటాన్ని పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఆ రథం నేలపై ఒరిగిపోకుండా ఓ రాతిని ఆసరాగా నిలబెట్టారు. అయితే ఆ రాతిపై ప్రాచీన తమిళ అక్షరాలను చెక్కబడి ఉండటాన్ని యేళ్లతరబడి గమనించలేదు. ఈ నేపథ్యంలో పురావస్తు పరిశోధకులు రాజ్పన్నీర్సెల్వం, ఆయన సహాయకులు బాలాజీ, శంకర్, ఉదయరాజా ఇటీవల తిరువణ్ణామలై ఆలయం వద్ద జరిగిన మహా కార్తీక దీపోత్సవాల వివరాలను సేకరించారు. ఆ సమయంలో మాఢవీధిలోని మురుగన్ రథం దిగువనున్న రాతిని నిశితంగా పరిశీలించారు. ఆ రాతి శుభ్రం చేయగా దానిపై ప్రాచీన తమిళ అక్షరాలుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాయి 12 శతాబ్దానికి చెందిన శిలాశాసనమని గుర్తించారు. ఆ రాతిపై ‘స్వస్తిశ్రీ నల్లూరాన్ విలక్కన్ తిరుచిట్రంబలం’ అని ప్రాచీన తమిళ అక్షరాలు చెక్కబడి ఉంది. నల్లూరు అనేది ఓ ఊరి పేరై ఉంటుందని, తిరుచిట్రంబలం’ అనేది వ్యక్తి పేరై ఉంటుందని పురావస్తు పరిశోధకులు రాజ్పన్నీర్సెల్వం తెలిపారు. ప్రాచీన కాలంలో ఓ స్తంభాన్ని నిర్మించేందుకు ఆ రాతిని తిరుచిట్రబలం దానంగా ఇచ్చి ఉంటాడని ఆయన పేర్కొన్నారు.