మహాశివరాత్రికి ముస్తాబవుతున్న రథం

ABN , First Publish Date - 2021-03-03T05:25:17+05:30 IST

మహా శివరాత్రి పండుగ సందర్భంగా రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేస్తున్నారు.

మహాశివరాత్రికి   ముస్తాబవుతున్న రథం
రథం వద్ద పూజలు నిర్వహిస్తున్న సభ్యులు


పొదిలి, మార్చి 2 : మహా శివరాత్రి పండుగ సందర్భంగా రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నుంచి రథం మరమ్మతు పనులు ప్రారంభించారు. నిర్మమహేశ్వర దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవానికి రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. ముందుగా రథ నిర్మాణ దాత, దేవస్థానం శాశ్వతదాత సామంతపూడి నాగేశ్వరరావు శివాలయంలో ప్రత్యేక పూజలు ని ర్వహించి రథం పనులు ప్రారంభించారు. రూ.40లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించి స్వామివారి కి కానుకగా ఇచ్చానని నాగేశ్వరరావు తెలిపారు. రథం అ లంకరణకు మద్రాసు నుంచి ప్రత్యేక నిపుణులు వస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవోఎన్‌వీ రవికుమార్‌, రి కార్డ్‌ అసిస్టెంట్‌ కాటూరి ప్రసాద్‌, నాయకులు కొత్తూరి శ్రీ ను, కె.బుజ్జి, యుద్ధం నరసింహారావు, పెరమసాని రమణయ్య, వినోద్‌, సామంతపూడి శేషయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-03T05:25:17+05:30 IST