రాడిసన్ పబ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2022-04-04T21:32:39+05:30 IST
రాడిసన్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాడిసన్ పబ్కు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: రాడిసన్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాడిసన్ పబ్కు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ నలుగురిలో అభిషేక్ ఉప్పాల, అనిల్కుమార్ అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజు పరారీలో ఉన్నారు. రాడిసన్ హోటల్ను 2017లో కిరణ్ రాజు అతని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 వరకు భార్యతో కలిసి కిరణ్ రాజు పబ్ను నడిపాడు. 2020 ఆగస్టులో అభిషేక్, అనిల్కుమార్కు కిరణ్ రాజు లీజుకిచ్చాడు. ఈ ఏడాది జనవరి నుంచి పబ్ని అభిషేక్ గ్యాంగ్ నడుపుతోంది. అభిషేక్ పబ్ నడుపుతున్నప్పటికీ భాగస్వామిగా కిరణ్రాజు ఉన్నాడు. డ్రగ్స్ కేసు నమోదు కావడంతో కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.