కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: రాఘవులు

ABN , First Publish Date - 2021-01-17T17:58:29+05:30 IST

పోపూరి రామారావు పేరుపై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రాఘవులు అన్నారు.

కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: రాఘవులు

గుంటూరు: సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడిగా ఉన్న పోపూరి రామారావు పేరుపై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని సీపీఎం నాయకుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో బాధ పడుతున్నామన్నారు. ఏపీలో కులం, మతం పేరుతో వైషమ్యాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవులను కూడా కేంద్రం లాక్కోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రాంతీయ పార్టీలపై ఉందని, ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్న రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంపై కలసి పోరాడాలని సూచించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ రాష్ట్ర హక్కులను కాపాడడానికి ముందుకు రావాలని రాఘవులు  పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-01-17T17:58:29+05:30 IST