సీఎం జగన్ వెనుక భారీ కుట్ర: రఘురామ
ABN , First Publish Date - 2021-03-09T19:58:58+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలన్న కుట్ర జరుగుతోందని...
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలన్న కుట్ర జరుగుతోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనకు తెలిసీ ముఖ్యమంత్రిపై కుట్ర చేసే ధైర్యం ఎవరికి ఉంటుందని తాను అనుకోవడంలేదన్నారు. అయితే రిపబ్లిక్ టీవీ వార్తను అంత తేలిగ్గా కొట్టిపడేయొద్దని, అందులో ఎంతోకొంత నిజం లేకపోతే ఆ వార్త రాదన్నారు. సీఎం జగన్ ఈ వార్తను అంత తేలిగ్గా తీసిపారేయొద్దన్నారు. ‘మీ వెనుక ఎవరైన దొంగ వెధవులు కుట్ర చేస్తున్నారేమో అన్న దృష్టితో ఆలోచించి నిజమైన బ్లాక్ షీప్ (కపటధారి)ను పట్టుకోండి’ అని రాఘురామ సూచించారు. ముందుగా చెక్క భజన చేస్తూ.. వెనుక గోతులు తీస్తున్నారేమో అన్న అనుమానం ఉందన్నారు.