రఘురామను చంపేస్తారేమో అన్న అనుమానాలు అందరికీ కలిగాయి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-05-17T23:07:19+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రఘురామను చంపేస్తారేమో అన్న అనుమానాలు అందరికీ కలిగాయి: చంద్రబాబు

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రఘురామ విమర్శలను వైసీపీ విమర్శలను పోల్చిచూడాలన్నారు. అసెంబ్లీలో తనను ఇష్టానుసారం తిట్టారని తెలిపారు. నిబంధనలను ఏపీ పోలీసులు పాటించలేదని ఆయన తప్పుబట్టారు. రఘురామను చంపేస్తారేమో అన్న అనుమానాలు అందరికీ కలిగాయని, ప్రాణాలతో అడుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 


మరోవైపు రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. 

Updated Date - 2021-05-17T23:07:19+05:30 IST