రఘురామ అరెస్ట్‌ రాత్రికి రాత్రే జరిగింది కాదు: సజ్జల

ABN , First Publish Date - 2021-05-18T23:55:22+05:30 IST

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

రఘురామ అరెస్ట్‌ రాత్రికి రాత్రే జరిగింది కాదు: సజ్జల

అమరావతి: సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎంపీ రఘురామపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసిందన్నారు. రఘురామ అరెస్ట్‌ రాత్రికి రాత్రే జరిగింది కాదని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే రఘురామను వాడుకున్నారని మండిపడ్డారు. రఘురామను అరెస్ట్‌ చేస్తే టీడీపీ గగ్గోలు పెడుతోందని దుయ్యబట్టారు. పార్టీ నచ్చకపోతే రఘురామ ఎందుకు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు. రఘురామ ఏడాది నుంచి ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-05-18T23:55:22+05:30 IST