ఇంగ్లిష్‌ మీడియంపై ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వస్తుంది: రఘురామ

ABN , First Publish Date - 2020-10-30T19:04:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.

ఇంగ్లిష్‌ మీడియంపై ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వస్తుంది: రఘురామ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఇంగ్లిష్‌ మీడియంపై సుప్రీం కోర్టులో కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ భాషలో పాఠశాలల్లో విద్యాభ్యాసం ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలన్నారు.


కరోనాను లెక్క చేయకుండా... విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. సీఎం జగన్‌ ఆవేశం తగ్గించుకొని... ఆలోచన పెంచుకోవాలని రఘురామ సూచించారు.

Updated Date - 2020-10-30T19:04:04+05:30 IST