రఘునాథ్పై చర్యలకు ఆదేశం
ABN , First Publish Date - 2020-07-14T11:25:34+05:30 IST
అన్నవరం దేవస్థానం పూర్వపు ఈవో రఘు నాథ్పై చర్యలకు సోమవారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడం ..
ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం
అన్నవరం, జూలై 13: అన్నవరం దేవస్థానం పూర్వపు ఈవో రఘు నాథ్పై చర్యలకు సోమవారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడం సంచలనం రేకెత్తించింది. 2006-2009 మధ్య ఆయన ఈవోగా చేసిన సమ యంలో పలు నియామకాలను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారనే విమ ర్శలొచ్చాయి. దాంతో అప్పట్లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు అన్నవరంలోని ఆయన ఇంటిలోను, బంధువుల ఇళ్లల్లోను ఏకకాలంలో సోదాలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం, అందులోని అంశాలు ఏవో పేర్కొనకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.