నన్ను చంపేస్తానని గోరంట్ల బెదిరించారు
ABN , First Publish Date - 2021-08-04T09:41:46+05:30 IST
వైసీపీలో తిరుగుబాటు ఎంపీగా ముద్రపడిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును చంపేస్తానంటూ.
ప్రధాని, హోంమంత్రి, స్పీకర్కు రఘురామ ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీలో తిరుగుబాటు ఎంపీగా ముద్రపడిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును చంపేస్తానంటూ.. సొంత పార్టీకే చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ సాక్షాత్తూ పార్లమెంటు సెంట్రల్హాలులోనే బెదిరించినట్లు వచ్చిన వార్తలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై లోక్సభ స్పీకర్తోపాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ‘నేను మంగళవారం ఉదయం 11.50 గంటల సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాలులో నడిచి వస్తుండగా.. ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చి.. నన్ను దుర్భాషలాడుతూ.. మళ్లీ మీడియాలో కనిపిస్తే హతమారుస్తానని బెదిరించారు. ఈ ఘటన వెనుక సీఎం హస్తం ఉందా, లేదా.... లేక సీఎం వెనక ఉండే ఇదంతా చేయించారా అన్నది తేలాల్సి ఉందన్నారు. తక్షణమే వీడియో ఫుటేజీలను పరిశీలించి, మాధవ్పై చర్యలు తీసుకోవాలి’ అన్నారు. సెంట్రల్ హాల్లో ఉన్న ఎంపీలంతా ఈ ఘటన చూసి ఆశ్చర్య పోయారని, వారి సహకారంతోనే తాను అప్పటికప్పుడు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారని రఘురామ చెప్పారు.