మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు.. దాడులు కూడా జరిగే ప్రమాదం..: రఘురామ

ABN , First Publish Date - 2021-11-06T20:10:58+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు.. దాడులు కూడా జరిగే ప్రమాదం..: రఘురామ

న్యూఢిల్లీ: అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ఆ మంత్రి వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరి, తాటికొండ ప్రజలపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


బద్వేలు ఉప ఎన్నిక గెలుపు నిజమైన గెలుపు కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ నిర్వహించారని, దీనిపై ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. ఏపీ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానన్నారు. సోలార్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-06T20:10:58+05:30 IST