గొడ్డలి పోటును.. గుండె పోటని ఎందుకు చెప్పావ్? ఎవరు చెప్పమన్నారు? విజయసాయికి రఘురామ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-01-17T20:36:02+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గొడ్డలి పోటును.. గుండె పోటని ఎందుకు చెప్పావ్? ఎవరు చెప్పమన్నారు? విజయసాయికి రఘురామ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేకా హత్య తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారని విజయసాయి ప్రకటించారని, తర్వాత గొడ్డలి పోటుతో మరణించారని తెలిసిన తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపించారని అన్నారు. అసలు వివేకను ఎవరు చంపారో అందరికీ తెలుసునని.. చివరికి సీబీఐ విచారణలో వైసీపీ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఏదీ ఏమైనప్పటికీ గొడ్డలి పోటును.. గుండె పోటని ఎందుకు చెప్పావ్?.. ఎవరు చెప్పమన్నారని విజయసాయికి రఘురామ సుటిగా ప్రశ్నించారు. ఎవరిని కాపాడ్డానికి ఈ ఘటనను టీడీపీపైకి నెట్టారని నిలదీశారు. హత్యలు చేసేది ఎవరో.. ఆ ట్రాక్ రికార్డు చూసి భయపడుతున్నామని రఘురామ అన్నారు. వివేకను హత్య చేసింది ఎవరో తెలుసునని, చేయించింది ఎవరో త్వరలోనే బయటకు వస్తుందన్నారు. మరి ఏపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే భయపడొద్దంటావా? విజయసాయీ.. అంటూ రఘురామ అన్నారు. భయపడి తాను పారిపోలేదని, రావలసిన చోటుకు వచ్చానన్నారు. తనను మర్డర్ చేస్తారనే ప్లాన్ విషయం తెలిసే.. ప్రాణ రక్షణ కోసం ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చానని రఘురామ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-17T20:36:02+05:30 IST